Home » Sangareddy
అతి వేగంతో వాహన ప్రయాణం ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలో రాంసాన్పల్లి శివారులో 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబమే బలైపోయింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తాడ్కూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(35), సునీత(30) దంపతులకు కుమారుడు నగేష్(7) ఉన్నాడు. వీరు ముగ్గురు శుక్రవారం బైక్పై తాడ్కూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ - జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) కుమార్తె త్రిషతో కలిసి 196వ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఏనాడు చూడని విధంగా.. రక్తపాతం, కత్తులతో నరుక్కోవడం, మతాలు, కులాలుగా సమాజం విడిపోయేలా వైషమ్యాలను రెచ్చగొట్టేలా దుష్టశక్తులు పనిచేస్తున్నాయన్నారు.
Telangana: రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు చేరుకున్న సీఎం.. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. మతాల మధ్య మనుషుల మధ్య గొడవలు పెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమైనా ఇస్తారేమో అని చూసామని... కానీ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. హిందూ, ముస్లింలు కొట్టుకొని చావాలని..
మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించినా పర్వాలేదు కానీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎ్సపై కాంగ్రె్సకు భారీ మెజారిటీ ఇవ్వాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.
మోదీ పాలనలో అచ్చె దిన్ రాలేదు కాని.. చచ్చే దిన్ మాత్రం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఇచ్చిన 150 హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా బుధవారం కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. పటాన్ చెరు జాతీయ రహదారిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
సంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం సంగారెడ్డిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రఘునందన్రావు మాట్లాడుతూ..
Telangana: కేవలం కుటుంబ సభ్యుల బాగు కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకునేది బీజేపీ మాత్రమే అని మాజీ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. శనివారం సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు తమిళ సై హాజరై ప్రసంగించారు.
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం, ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి..మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. వివరాల్లోకి వెళితే..