Home » PM Modi
మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాడని.. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్తో కూల్చేస్తారనడం దారుణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ విశ్వాసాలను రెచ్చగొట్టుతున్నాడని.. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. రామాలయం దేవాలయ గేట్స్ తెరిచింది రాజీవ్ గాంధీయే అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. వీడియోలు బయటకు వచ్చేందుకు కారణం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అని బీజేపీ నేత జి దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా ఫినిష్ చేయాలనేది శివకుమార్ టార్గెట్ అని బాంబ్ పేల్చారు. అందుకోసం తనను సంప్రదించారని వివరించారు.
తన పదాలను ప్రధాని నరేంద్ర మోదీ కాపీ కొట్టడాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఆయనతో ఏమైనా చెప్పించగలనని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. మోదీ నోట ఏ మాటలు వినకూడదని..
‘ప్లాన్-బీ’.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. లోక్సభ ఎన్నికలు ముగిశాక వచ్చే ఫలితాలను బట్టి.. బీజేపీ ‘ప్లాన్-బీ’ అమలు చేయొచ్చనే వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా..
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్క నేతను వదిలిపెట్టదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓకే దేశం, ఓకే నేత విధానంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గిందని ఆయన వివరించారు.
‘‘బస్సు ప్రయాణాన్ని (మహిళలకు) ఉచితం చేశారు. మెట్రోను ఖాళీ చేశారు. మరిప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది? దేశం ఎలా ముందుకు సాగుతుంది?’’ ..అంటూ ప్రధాని మోదీ కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకంపై పరోక్ష విమర్శలు చేశారు!
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయంపైకి బుల్డోజర్ను పంపుతాయని ప్రధాని మోదీ అన్నారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంలోనే చైనా దురాక్రమణకు దేశ భూభాగాన్ని కోల్పోయామన్నారు
రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో యుటిలిటీ చార్జీలను చెల్లించబోమని గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి లేఖ రాయడంతో మొత్తం ప్రాజెక్టే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యుటిలిటీ చార్జీల కింద రూ.363.43 కోట్లను చెల్లిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి, తాను కలిసి లేఖ రాశామని వెల్లడించారు.
ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆప్ అధినేత కేజ్రీవాల్ విమర్శించారు.