Home » Nominations
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేయడంలో పేరున్న యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలాకు చేదు అనుభవం ఎదురైంది. నరేంద్ర మోదీ మంగళవారంనాడు నామినేషన్ వేసిన వారణాసి (Varanasi) నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ నామినేషన్ దాఖలుకు జిల్లా యంత్రాంగం తనను అనుమతించ లేదని ఆయన ఆరోపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు వారాణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్డీయే భాగస్వామ్య నేతలతో కలెక్టరేట్ కార్యాలయం వెలుపల బలప్రదర్శన చేశారు. ఎన్డీయే కూటమి నేతలు తమ సంఘీభావాన్ని చాటుతూ మోదీ నాయకత్వంలో పనిచేయడం పట్ల హర్షం ప్రకటించారు.
ప్రధాని మోదీ(PM Modi) మే 14న ఉత్తరప్రదేశ్లోని వారణాసి(Varanasi) లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.
రాయబరేలి నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభ్యర్థిత్వం ఖరారు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. అమేథీలో పోటీకి బయపడే ఆయన రాయబరేలి వైపు పరిగెత్తుతున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభ నియోజకవర్గం నుంచి శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన వెంట సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రా హాజరయ్యారు.
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సోమవారంనాడు నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె వెంట నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ( AP Elections 2024)ల్లో కీలక ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల స్వీకరణ గడువు ఏప్రిల్ 25వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.
ఎవరీ పద్మావతి.. ఇప్పుడీ ఈ పేరు ఒక్క గుడివాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె.. ఎందుకింతలా హైలైట్ అవుతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘ ట్టం గురువారంతో ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశా రు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి 21 మంది అభ్యర్థులు 34 నా మినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అభిషేక్ కుమార్ తెలిపారు.
Andhrapradesh: ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. రేపు (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అలాగే మే 11 సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.