Home » National News
లోక్సభకు ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో 'ఇండియా' కూటమి ఆధిక్యంలో ఉందని, మొత్తంగా 273కు పైగా సీట్లను తము కూటమి గెలుచుకోవడం ఖాయమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.
భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని, దేశాన్ని నియంతృత్వం దిశగా నడిపిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 'ఆప్'ను లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నందునే తమ నేతలనందరినీ జైలుకు పంపాలనుకుంటోందని అన్నారు.
కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు మనపై ఏది చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడని అన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. విపక్ష 'ఇండియా'కి ఓటు వేసి గెలిపిస్తే రామాలయంపై బుల్డోజర్ నడిపిస్తుందంటూ పదేపదే ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాయబరేలితో తన కుటుంబ సభ్యులకు, తనకు ఉన్న అనుబంధాన్ని, తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి తన సోదరి ప్రియాంక గాంధీకి, తనకు మధ్య జరిగిన సంభాషణల వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన పోస్ట్ చేశారు.
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రజల్వ్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మౌనం వీడారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉందనే సంకేతాలిచ్చారు. ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందో వారందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే వారి పేర్లు తాను చెప్పదలచుకోలేదన్నారు.
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం అక్కడుంటున్న భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. ఎవరూ బయటకు రావొద్దని..
సొంత పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి జరిగిందంటూ చేసిన ఆరోపణలను 'ఆప్' కీలక నేతలు అంతే ధీటుగా తిప్పికొడుతున్నారు. తాజాగా 'ఆప్' మంత్రి అతిషి అగర్వాల్ కూడా ఇందులో చేరారు. బీజేపీ కుట్రలో స్వాతి మలివాల్ ఒక పావుగా మారారని, ముఖ్యమంత్రి నివాసంలో ఆయన సహాయకుడు తనపై దాడి చేసినట్టు ఆమె చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని చెప్పారు.
రాయబరేలి ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక అభ్యర్థన చేశారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్ గాంధీ ని కూడా అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు.
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి వ్యవహారం ముదురుతోంది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్టు స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలపై తొలుత ఆమెకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన 'ఆప్' తాజాగా ఆమెపై గుర్రుమంటోంది. ఈ వివాదాన్ని స్వాతి మలివాల్ పొడిగిస్తూ పోతుండటంతో ఆమెకు, ఆప్కు మధ్య 'మాటల యుద్ధం' ముదురుతోంది.