Home » MLC Elections
లోక్సభ ఎన్నికలతో (Lok Sabha Election 2024) ఎన్నికల సంఘం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈరోజు(శనివారం) తెలంగాణ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. అంతకుముందు కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు.
Telangana: పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. రెండు సార్లు కేసీఆర్కు అవకాశం ఇచ్చిన ప్రజలు... మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం నేడు పట్టభద్రుల ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. 10 నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదలైంది.
గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా కొనసాగనుంది.
కీలకమైన ఉత్తరప్రదేశ్, బీహార్ విధాన పరిషత్ ఎన్నికలకు తమ అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ శనివారంనాడు ప్రకటించింది.యూపీలోని 13 మంది ఎమ్మెల్సీల పదవీకాలం మే 5వ తేదీతో ముగియనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్రటేరియట్లోనే రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలను మధ్యాహ్నం సీఎం రేవంత్, మంత్రులు ప్రారంభించనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్ నగర్లో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్నందున రంగారెడ్డి జిల్లాకు కూడా కోడ్ వర్తించనుంది.
బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. 11 సీట్లకు జరగాల్సిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు ప్రకటించింది. వీటిలో నితీష్ కుమార్ సీటు కూడా ఉండటం విశేషం.