Home » Maharashtra
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. విపక్ష 'ఇండియా'కి ఓటు వేసి గెలిపిస్తే రామాలయంపై బుల్డోజర్ నడిపిస్తుందంటూ పదేపదే ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టేకాఫ్కి ముందు ఎయిర్ ఇండియాకు(Air India) చెందిన ఓ విమానం ట్రక్కును ఢీకొట్టింది. డ్రైవర్ల అప్రమత్తతతో అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి నగదు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే లగేజీని ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో ముఖ్య పార్టీల నేతలు రిలాక్స్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్రలో గల కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
మహారాష్ట్రలోని నాందేడ్లో బండారీ ఫైన్సాన్స్, అదీనాథ్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.170 కోట్ల విలువైన సంపదను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు.
‘హిందూ-ముస్లిం’ రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజాజీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ‘ఆంగ్ల వార్తాచానల్ సీఎన్ఎన్-న్యూ్స18’కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని తెలిపారు.
క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు బలవన్మరణానికి పాల్పడటం స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(SRPF)లో కలకలం రేపింది.
మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎంల భద్రతపై ఆ నియోజకవర్గం ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి సుప్రియా సూలే ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరచిన గిడ్డంగిలో సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు సీసీటీవీలను స్విచ్ఛాప్ చేశారని ఆమె ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలో రానుందని.. తాను కూడా ప్రధాని పదవి రేసులో ఉన్నానని జాతీయ పార్టీ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు! రాష్ట్రంలో రాజకీయంగా బతికి బట్టకట్టడమే పెను సవాల్గా కనిపిస్తున్న పరిస్థితుల్లో.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటున్నారు. ఏ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాల్సిందేనని.. ఈమేరకు తాను ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు.
ప్రతిపక్షాలకు చెందిన కొందరు తనని సజీవసమాధి చేయాలని అనుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, దేశ ప్రజలు తనకు రక్షణ కవచంలా ఉన్నంత వరకు తనని ఎవరు ఏం చేయలేరని తెలిపారు. మహారాష్ట్రలోని నందుర్బార్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి హీనా గవిత్కు మద్దతుగా ప్రధాని మోదీ గురువారం ప్రచారం నిర్వహించారు.