Home » Central Govt
ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర అబ్రివియేషన్ను సూచించే ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’ని వినియోగించేందుకు కేంద్రం అనుమతి లభించింది. గత మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన అనుమతులు రాగా.. తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎ్సకు బదులుగా టీజీని వినియోగించేందుకు ఓకే చెప్పింది.
బూటకపు ఎన్కౌంటర్లను హెచ్చరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోలు శుక్రవారం లేఖ రాశారు. అల్లూరి డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్ట్ పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. భారత విప్లవోద్యమం నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక దాడిని ఓడిద్దామని పిలుపునిచ్చారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను దొరక బట్టి చంపుతున్నారని.. బూటకపు ఎన్కౌంటర్లను నిజమైన ఎన్కౌంటర్లగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధుల మంజూరులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేంద్రం గత రెండేళ్లుగా ఈ నిధులను సకాలంలో ఇవ్వడం లేదు. ఇలా సుమారు రూ.500 కోట్లు కాలాతీతం కావడంతో మురిగిపోయాయి. కేంద్రం తీరుతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణపై వివక్ష చూపుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.
సీబీఐపై తమ కంట్రోల్ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు(Supreme Court) తేల్చిచెప్పింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 131 ప్రకారం ఈ కేసు వేసింది.
Andhrapradesh: ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ఎటువంటి సందేహాలు వద్దని.. జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధమన్నారు. భూ హక్కు దారులకు ప్రయోజనం కలిగేలా యాక్ట్ను తీసుకువస్తున్నామని తెలిపారు. దళారి వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామని చెప్పారు.
కరువు సహాయక పనుల కోసం కర్ణాటకకు రూ.3,454 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ కరువు ఉపశమనం (ఖరీప్ 2023) కింద నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
కాళేశ్వరం (Kaleshwaram) బ్యారేజీల అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం తదితర విషయాలపై విచారించడానికి జస్టిస్ చంద్ర గోష్ (Justice Chandra Ghosh) కమిషన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన విషయం తెలిసిందే. నేటి(గురువారం) నుంచి జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను దృష్టిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి విజయం సాధించాలని కోరుకున్నానని అన్నారు. ఏపీ అభివృద్ధికి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, ఈ ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
కాంబోడియాలో చిక్కుకుపోయిన ఎన్నారైలను స్వదేశానికి సురక్షితంగా తరలించామని విదేశాంగ శాఖ శనివారం ప్రకటించింది.
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉపాధి హామీ కూలీల వేతనాలు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాలకుగానూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద (MGNREGS) 4 - 10 శాతం వరకు వేతనాలు పెంచింది. వేతనాల సవరణలో భాగంగా ప్రభుత్వం పెంపుదలను ప్రతిపాదించింది.