Home » Arvind Kejriwal
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్క నేతను వదిలిపెట్టదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓకే దేశం, ఓకే నేత విధానంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గిందని ఆయన వివరించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఈడీ శుక్రవారం ఛార్జీషీట్ దాఖలు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్(Swati Maliwal)పై దాడి జరిగిన నేపథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైలెంట్గా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం పీఎ బిభవ్ కుమార్కు జాతీయ మహిళా కమిషన్ గురువారం సమన్లు జారీ చేసింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్జప్తి చేశారు. గురువారం లఖ్నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్తోపాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు.
కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేదో సాధారణ తీర్పు అని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలా మంది.. కేజ్రీవాల్కు (కోర్టు) స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నమ్ముతున్నారు’’ అని ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. బీజేపీలో ఉన్న ఆనవాయితీ ప్రకారం.. 75 ఏళ్ల వయసు రాగానే.. అంటే 2025లో మోదీ రిటైర్ అవుతారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపైనా అమిత్ షా స్పందించారు.
కేజ్రీవాల్ని(CM Arvind Kejriwal) ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్ని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల ప్రచారం కోసం జూన్ 1వ తేదీ వరకూ మధ్యంతర బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో రెండో రోజైన ఆదివారంనాడు కూడా రోడ్షో కొనసాగించారు. తమ పార్టీకి గరిష్టంగా ఓట్లు వేస్తే 20 రోజుల తర్వాత తాను జైలుకు తిరిగి వెళ్లక్కరలేదని అన్నారు.