Home » Arrest
మనీ లాండరింగ్ కేసులో జార్ఖాండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసులో ఆలమ్ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది.
యూట్యూబ్(Youtube) చూస్తూ బ్యాంక్లో చోరీకి యత్నించిన ఎంబీఏ పట్టభద్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసుల కథనం మేరకు... మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపం అరియపట్టి గ్రామానికి చెందిన లెనిన్ (30) ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంక్లో పనిచేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా వైసీపీ అరాచకాలు, ఆగడాలు ఆగట్లేదు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు రెచ్చిపోయిన ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. సొంత బావమరిది అని కూడా చూడకుండా అధికారంను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు.
హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్తో పాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా ఇంచార్జీ కృషాంక్ను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. కృషాంక్పై నిన్న పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను నాలుగు రోజుల పోలీస్ రిమాండ్కు ముంబై కోర్టు ఆదివారంనాడు ఆదేశించింది. 'స్టయిల్', 'ఎక్స్యూజ్ మీ' వంటి పలు హిందీ చిత్రాల్లో సాహిల్ నటించారు.
రాత్రివేళ రోడ్డు పక్కన ఫుట్పాత్లు, ఆటోలలో నిద్రిస్తున్న వ్యక్తులను టార్గెట్గా చేసుకుని స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను నల్లకుంట పోలీసులు(Nallakunta Police) అరెస్ట్ చేశారు.
ఇది ఐపీఎల్ ( IPL ) సీజన్. రోజుకో మ్యాచ్, వీకెండ్ లలో రోజుకు రెండు మ్యాచ్ లు, వీటితో పాటు అంతర్జాతీయ సిరీస్ లు, చిన్న చిన్న మ్యాచ్ లు, వార్మప్ మ్యాచ్ లు అదనం. ఈ సమయంలోనే బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు.
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. శుక్రవారం మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది. ఢిల్లీ మద్యం కేసులో కవితను గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.
తాను ఐఏఎస్ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్ను(IAS) తిరుమల(Tirumala) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి బుధవారం తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి 11వ తేదీకి నాలుగు ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు...