Home » AP BJP
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్సభ ఎన్నికలు -2024 పోలింగ్ ముగిసింది. చాలా ప్రాంతాల్లో వైసీపీ మూకలు హింసాత్మక ఘటనల మధ్య ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి పోలింగ్ సిబ్బంది అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఏపీలో ఓటింగ్ 67.99 శాతం పోలింగ్ నమోదయింది.
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై (CM Ramesh) వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో రమేష్కు స్వల్పగాయాలవ్వగా.. చొక్కా చిరిగిపోయింది. మరోవైపు.. ఆయన కారుతో పాటు కాన్వాయ్లోని మూడు కార్లపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా వైసీపీ అరాచకాలు, ఆగడాలు ఆగట్లేదు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు రెచ్చిపోయిన ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. సొంత బావమరిది అని కూడా చూడకుండా అధికారంను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మేనిఫెస్టోను (NDA Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోపై చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేనిఫెస్టోలో బీజేపీ పాత్ర ఎందుకు లేదు..? ఫోటోలు ఎందుకు లేవు..? అనే విషయాలపై క్లియర్ కట్గా చంద్రబాబే చెప్పినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పరిస్థితి...
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో (NDA Manifesto) వచ్చేసింది. దీంతో మేనిఫెస్టో ఏయే వర్గాలకు ఏమేం శుభవార్తలు చెప్పారు..? పెన్షన్లు ఎంత పెంచారు..? విద్యార్థులకు కూటమి ఇచ్చిన హామీలేంటి..? రైతన్నలకు చంద్రన్న చెప్పిన ప్రకటనలేంటి..? మహిళలకు ఏమేం ఉచితమని చెప్పారు..? బీసీలు, ముస్లిం మైనార్టీలకు ఎన్డీఏ ఎలాంటి శుభవార్తలు చెప్పింది..? ఇలా ఒకటా రెండా.. ఆయా వర్గాలు నిశితంగా మేనిఫెస్టో చదివే పనిలో నిమగ్నమయ్యాయి..
ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయా అధికారులు హామీ ఇచ్చారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. కానీ నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Daggubati Purandeswari: రాజీలేని రాజకీయ చాతుర్యం.. వాగ్దాటిలోని గాంభీర్యం.. వ్యవహారంలో చాణక్యం.. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం.. అన్నింటికీ మించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ‘తూర్పు’ ఆడబడుచుగా సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ బరిలో బీజేపీ తరపున అడుగుపెట్టారు...
అవినీతి, అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దెం దింపేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ (BJP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి తెలిపారు. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఒకరు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా ఈ చేరిక జరిగింది.
TDP MP Candidates List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) గెలుపే లక్ష్యంగా కూటమి దూసుకెళ్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమిగా ఏర్పడిన రోజే గెలిచిపోయామని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక అభ్యర్థుల ప్రకటనలో యమా జోరుమీదున్న టీడీపీ.. ఇప్పటిదే దాదాపు అభ్యర్థులను ప్రకటించేసింది..