Home » Telangana
లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. కాంగ్రె్సకు 125 సీట్లు వచ్చినా సరిపోతుందని, కూటమిలోని భాగస్వామ్యపక్షాలు మద్దతు ఇస్తాయని సీఎం రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మాత్రం ఆ పార్టీకి 250కి పైగా సీట్లు రావాల్సి ఉంటుందన్నారు. ‘బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ) దాటలేకపోతే.. మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీకి నమ్మకమైన మిత్రులెవరూ లేరు. కాంగ్రెస్ పరిస్థితి వేరు. మాకు మద్దతు పలికేందుకు అనేక మిత్రపక్షాలు సిద్ధంగా ఉన్నాయి’ అని వివరించారు.
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువల భారీగా పెరిగాయని, కానీ.. అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు.
రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను ఓడించేందుకు గత్యంతరం లేని పరిస్థితిలోనే కాంగ్రె్సను గెలిపించారని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నా రు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే చీ కొట్టించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అలవి కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగించాలని తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మృగశిర కార్తె రోజున హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో ‘ఫిష్ ఫెస్టివల్’ నిర్వహించాలని కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర సమన్వయకర్త బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు రంజిత్ ముదిరాజ్ తదితరులతో కలిసి మాట్లాడారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బీఆర్ఎ్సలో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి, ‘గెలిపించుకు రండి’ అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్ఠానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నబాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎ్సలో చేరిన ఏనుగుల రాకేశ్ రెడ్డిని అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ విద్యుత్ సంస్థలపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోమని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తూ సంస్థల ప్రతిష్ఠను మరింత దిగజారుస్తున్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు ఏ.శంకర్, సంయుక్త కార్యదర్శి డి.కోటేశ్వరరావు, జాతీయ ఓబీసీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు, రిటైర్డ్ సీజీఎం ఆళ్ల రామకృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు, రిటైర్డ్ అధికారులను సీఎండీలు, డైరెక్టర్లుగా నియమించి సంస్థను నిలువు దోపిడీ చేశారన్నారు. పదోన్నతులు, పోస్టింగుల్లో పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడ్డారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్లు కూడబెట్టారని ఆరోపించారు.
జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికకు లోబడి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయాలని ఎల్ అండ్ టీని నీటిపారుదల శాఖ కోరింది. ఈ మేరకు నిర్మాణ సంస్థకు రామగుండం చీఫ్ ఇంజనీర్ లేఖ రాశారు. మేడిగడ్డకు తదుపరి మరమ్మతులు చేయాలంటే కాంపోనెంట్ల వారీగా కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ మేరకు చెల్లింపులూ చేయాల్సి ఉంటుందని ఎల్ అండ్ టీ ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
దొడ్డు రకం వడ్లకూ బోనస్ ఇవ్వాలని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలనుఅమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మానకొండూర్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడం, అవసరం లేకున్నా ఛత్తీ్సగఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వంటి కారణాలతో జరిగిన నష్టంపై 10 రోజుల్లోగా (ఈ నెల 16 నుంచి) ఫిర్యాదు చేయాలని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ కోరింది. ఈ మేరకు గురువారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. పోటీ బిడ్డింగ్ ద్వారా కాకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీ్సగఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం, సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్లు కడుతుండగా..
అద్దె బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆర్మూర్లోని జీవన్రెడ్డి మాల్ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్ వద్దకు చేరుకున్న అధికారులు భవనానికి నోటీసులు అతికించి.. తాళం వేశారు. ఒప్పందం ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ బాధ్యులు అద్దె చెల్లించనందు వల్ల హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకుంటున్నట్టు మైక్లో ప్రకటించారు. మాల్లో ఉన్న షాపుల యజమానులు సహకరించాలని కోరారు.