Home » YSRCP
Andhrapradesh: వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఏపీని రావణకాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కేరీర్లో మచ్చ తెచ్చుకున్నారని... అందుకే పాత ఎఫ్.ఐ.ఆర్ను కూడా మార్చమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.
ఏపీలో వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు.. ఇలా అందరిపైనా అరాచకంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా వైసీపీ మూకల హింసాకాండ యథేచ్ఛగా కొనసాగింది. ఆ పార్టీ దౌర్జన్యాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. వైసీపీ మూకలు ఏకంగా ఎస్పీ వాహనంపైనే రాళ్లు విసిరారు! పోలీసులే ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల రణరంగం అంతా ఇంతా కాదు. టీడీపీ నేతలపై దాడులు, నిర్బంధం ఇలా అనేక రకాలుగా దుశ్చర్యలకు పాల్పడ్డారు వైసీపీ నేతలు. అధికారపార్టీ విధ్వంసంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ వైసీపీ నేతలను పోలీసుల అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయంపై ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి ఎస్ఐపై వైసీపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల13న బొల్లాపల్లి ఎస్ఐ చెన్నకేశవులుపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెలుగు యువత నాయకుడు పోక వెంకట్రావు కారుపై దాడి చేసి బొల్లాపల్లి వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారు.
పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో దాచిన పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు భారీగా స్వాధీనపరచుకున్నారు. పోలీసులు అల్లర్లు జరిగిన గ్రామల్లో విస్తృత తనిఖీలు నిర్వహించేక్రమంలో ఇవి
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) వ్యాఖ్యానించారు. తాజాగా ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరిందని అన్నారు. ఇలా అనేకం జరుగుతున్నా వైసీపీ(YCP) మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు(police) ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఏపీలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు.
Andhrapradesh: ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Andhrapradesh: పల్నాడులో జరుగుతున్న దాడులపై గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. దాడులను నియంత్రించటంలో ఎన్నికల సంఘం, డీజీపీ, చీఫ్ సెక్రటరీ పూర్తిగా విఫలమయ్యారన్నారు.
తనపై అనర్హత వేటు కక్షపూరిత చర్య అని ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి తెలిపారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే వేటు వేశారన్నారు. ఈ వేటును బీసీలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదన్నారు. తన బీసీ వర్గాలకు ఇచ్చిన పదవి అని పేర్కొన్నారు. చైర్మన్పై ఒత్తిడి తీసుకొచ్చి తనపై వేటు వేయించారన్నారు.