Home » Rains
కన్నియాకుమారి నుంచి పళవేర్కాడు దాకా సముద్రతీరం పొడవునా బుధవారం ఉదయం ‘అల’జడి అధికమైంది. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీరంలో మన్నార్ జలసంధి వద్ద పెనుగాలలు వీయడంతో అలలు ఎగసి పడుతున్నాయి.
నైరుతి రుతుపవనాలు బుధవారం తెలంగాణ మొత్తం, చత్తీస్గఢ్లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి.
వర్షాకాలం వేసుకునే రెయిన్ కోట్స్ ఆకర్షణీయమైన రంగుల్లో, అందమైన మోడళ్లలో తయారవుతున్నాయి. వేసుకునే దుస్తులకు తగ్గట్టు రకరకాల
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు స్వల్పంగా వరద రాక ప్రారంభమైంది. ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదవుతుందని అంచనాల మేరకు ప్రాజెక్టుల పరిధిలోని రైతులు వరదపై ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది కృష్ణా బేసిన్ పరిధిలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. ఈ కారణంగా పలు ఎత్తిపోతల పథకాల కింద వానాకాలం సీజన్లోనే వరి పంట ఎండిపోగా ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్లో క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చార్మినార్ సర్దార్ మహల్లో అత్యధికంగా 4.8, వారాసిగూడ బౌద్ధ నగర్లో 4.7 సెం.మీ వర్షం కురిసింది. రామాంతాపూర్, కాప్రా, హయత్నగర్, బండ్లగూడ, అంబర్పేట, నాచారం, హబ్సిగూడ ప్రాంతాల్లో 4 సెం.మీ.కుపైగా వాన పడింది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాన పడుతోంది. ఎల్బీ నగర్,ఉప్పల్, కాప్రా, మేడ్చల్లో కూడా కుండపోత వాన కురుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇంకోవైపు రాబోయే 48 గంటల్లో కొంకణ్ & గోవా(goa) మధ్య మహారాష్ట్ర(maharashtra), మరాఠ్వాడా, కోస్టల్ & నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.
ఇటీవల కురిసిన వర్షానికి మండలంలోని మందలపల్లిలో ఆర్ అండ్బీ రోడ్డులో వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందలపల్లిలో ఆర్అండ్బీ ప్రధాన రోడ్డు గుంతపడటంతో కురిసిన వర్షం నీరంతా అక్కడికి చేరి నిలిచి పోయింది.
జిల్లాలోని 20 మండలాల్లో శనివారం రాత్రి వర్షం పడింది. అత్యధికంగా గుంతకల్లులో 22.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. యాడికి 18.2, ఉరవకొండ 15.8, పామిడి 15.4, బెళుగుప్ప 14.2, తాడిపత్రి 12.2, గార్లదిన్నె 9.4, ...
దేశంలో నైరుతి రుతుపవనాల(Southwest Monsoon) రాక మొదలైంది. ఈ క్రమంలో అనేక చోట్ల వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాతోపాటు కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.