Home » KTR
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బీఆర్ఎ్సలో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి, ‘గెలిపించుకు రండి’ అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్ఠానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నబాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎ్సలో చేరిన ఏనుగుల రాకేశ్ రెడ్డిని అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
Telangana: మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న కామెంట్స్పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. పద్మశాలిలు నిరోద్లు అమ్ముకోవాలంటూ తాను వ్యాఖ్యలు చేసినట్లుగా కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలిలను అనలేదనీ, ఒక వ్యక్తితో వేరే సందర్బంలో మాట్లాడిన వాటిని కట్అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారని తెలిపారు.
రాష్ట్రంలో సక్రమంగా విద్యుత్తు సరఫరా చేయించడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చేతకావడంలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్తు ఉద్యోగులపై నిందలు మోపుతూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యుత్తు ఉద్యోగులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, తాము చెబితేనే కరెంటు కోతలకు పాల్పడుతున్నారంటూ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం తగదని హితవు పలికారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో బుధవారం ఆ మూడు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు.
చెదురమదురు హింసాత్మక ఘటనల మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికలు గత సోమవారం ముగిశాయి. ఓటరు మహాశయుల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే గెలుపుపై అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్తో పాటు ఇటు కూటమి పార్టీలు కూడా దీమా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరించి రాజకీయాలపైనే దృష్టి పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. తరుగు పేరుతో క్వింటాల్కు మూడు కేజీలు తీస్తున్నారని..
లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) తమ పార్టీకి అద్భుతమైన ఫలితాలు వస్తాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన అనంతరం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లు,తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరాబాద్లోని నందినగర్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడికే తన ఓటు వేసినట్లు పేర్కొన్నారు.
‘‘పుట్టేది ఒక్కసారే.. చనిపోయేది ఒక్కసారే.. మమ్మల్ని భయపెట్టి లొంగదీసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. తల తెగిపడినా సరే మోదీ ముందు తలవంచం. కేసీఆర్ పాలన అంటే పదేళ్ల నిజం.. బీజేపీ పాలన పదేళ్ల
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసపుమాటలు నమ్మవద్దని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ కలుగులో ఎలుక లాంటివాడని.. పెద్ద బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. కేసీఆర్ ఒక వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా అని విమర్శించారు. కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నాడని.. ఆయనేమైనా సుద్ద పూసా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరిగింది. ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ ఇవ్వడంతో మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు బ్రేక్ పడింది. మిగతా అంతా షెడ్యూల్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభావం అంతగా కనిపించడం లేదు.