Home » Heavy Rains
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లు, కొమ్మలు విద్యుత్తు తీగలపై విరిగిపడటంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలో ఎర్రటి ఎండలే కాయగా.. 3 గంటల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం పడింది. యూసుఫ్గూడలో 9 సెం.మీ., బంజారాహిల్స్ వెంకటేశ్వరకాలనీ 8.7 సెం.మీ, మలక్పేటలో 8.5, బేగంబజార్లో 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఐపీఎల్-2024లో భాగంగా.. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇది 66వ మ్యాచ్. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా..
హైదరాబాద్(Hyderabad Rains)లో కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సెక్రటేరియట్లోని అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు.
హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కొన్ని గంటల పాటు భానుడి తాపంతో భగభగమంటూ మండిపోయి నగరం.. మధ్యాహ్నం నుంచి చల్లబడింది. మేఘాలు కమ్మేసి..
హైదరాబాద్: రాష్ట్రంలో గురు, శుక్రవారాలు అక్కడక్కడ వర్షాలు కురుస్తామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు అధికారులు అరెంజ్ అలర్టు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మొస్తరు వర్షాలు కురిసే అవకావముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో రానున్న 3రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు 4 జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రేపు భద్రాది కొత్తగూడం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం సమీక్ష చేశారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో గాలి వాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
వేసవి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీకి వాతావరణ శాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Rains) కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది.
ఈ వేసవిలో భానుడి తాపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 14వ తేదీ వరకు తేలికపాటి..
ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అయితే గన్నవరంలో కూడా భారీ వర్షం పడుతుండటం.. ఓ పక్కన తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రజాగళం సభ కూడా జరుగుతోంది.