Home » Districts
ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ముడి ఇనుప గనుల లీజు ప్రాంతాల హద్దులను గుర్తించేందుకు కేంద్ర బృందం గురువారం సర్వే ప్రారంభించింది. మైనింగ్ జరుగుతున్న కొండల్లో వారంరోజుల పాటు సర్వే నిర్వహిస్తామని ఈ బృందం తెలిపింది. కర్ణాటకలోని టుముటి, విఠలాపురం సరిహద్దుల్లో ఏడు మైనింగ్ లీజులు ఉన్నాయి. వాటి లీజు కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో లీజ్ రెన్యువల్ చేసేందుకు ఎనఐటీకే సీనియర్ ప్రొఫెసర్ సూరత హర్షవర్ధన నేతృత్వంలోని బృందం సర్వే చేస్తోంది. ఏడు మైనింగ్ లీజులు ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి ఆనుకుని ఉండడంతో ఆంధ్ర, కర్ణాటక అధికారులు ...
నాలుగో తేదీ తరువాత అధికారం ఉంటుందో లేదో..! దీపం ఉండగానే ‘ఇంటి స్థలాలను అమ్మేసుకోవాలి’ అనుకున్నట్లున్నారు అధికార పార్టీ నాయకులు. బుక్కరాయసముద్రంలో జగనన్న కాలనీ ఖాళీ స్థలాలను కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. కొందరైతే ఏకంగా ‘ప్లాట్ ఫర్ సేల్’ అని బోర్డు పెట్టి మరీ అమ్మేస్తున్నారు. తక్కవ ధరకే ఇంటి స్థలం వస్తుందనుకుని అమాయకులు వారి వలలో పడుతున్నారు. డబ్బులు చెల్లించి పునాదులు వేసుకుంటున్నారు. ఈ దందాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మీన మేషాలు లెక్కబెడుతున్నారు. ...
విద్యాశాఖ పరిధిలో ఎవరు ఏ తప్పు చేసినా ఆ శాఖ జిల్లా అధికారులు ‘దయ’ చూపుతున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినా, ఫిర్యాదులు వచ్చినా ‘విచారణ’ పేరిట కాలయాపన చేస్తూ.. తప్పులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక జరిగిన అనేక సంఘటనలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వందలాది మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పీడీలు అనంతపురం నగర శివారులోని ఓ డాబాలో విందు రాజకీయం చేశారు. ఏపీటీఎఫ్ నాయకులు రాజేంద్ర స్కూల్లో సమావేశయ్యారు. ఉల్లంఘనలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. తూతూ మంత్రపు వివరణలు తీసుకుని సరిపెట్టారు...
మండలలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు, అర్చన, నిత్యహోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకు ...
పెన్నహోబిలం లక్ష్మీనరసింహాస్వామి శనివారం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహోత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి ...
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు జీవం పోసుకున్నాయి. అత్యధికంగా కళ్యాణదుర్గంలో 86.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కణేకల్లు 70.0, ఉరవకొండ 62.8, కుందుర్పి 58.6, వజ్రకరూరు 46.2, శెట్టూరు 44.2, బెళుగుప్ప 36.8, బొమ్మనహాళ్ 34.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల కారణంగా యల్లనూరు, పెద్దపప్పూరు, కూడేరు, పుట్లూరు, కుందుర్పి, పెద్దవడుగూరు, కంబదూరు, బెలుగుప్ప, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల్లో అరటి, బొప్పాయి, టమోటా, పత్తి పంటలు ...
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అనంతపురం, బెళుగుప్ప, పుట్లూరు, కూడేరు, గుంతకల్లు, పామిడి, కుందుర్పి, రాప్తాడు, పెద్దవడుగూరు, విడపనకల్లు, ఉరవకొండ, గార్లదిన్నె తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. యాడికి, తాడిపత్రి, శింగనమల మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. వర్షం కారణంగా విద్యుత సరఫరాకు ...
ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలలో శుక్రవారం నుంచి జూన ఒకటో తేదీవరకూ పరీక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో బుధవారం వివిధ శాఖల అదికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 ...
అడిగిన ప్రతి రైతుకు ఈ నెల 24 నుంచి విత్తనం అందించాలని కలెక్టర్ వినోద్ కుమార్.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయ, మార్కెటింగ్, బ్యాంకింగ్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజనలో సా గయ్యే పంటలు, విత్తన సేకరణ చర్యలు, పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18 నుంచి రైతు భరోసా కేంద్రాలలో రైతుల పేర్లు రిజిస్ట్రేషన చేయాలని సూచించారు. విత్తనం విషయంలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. వేరుశనగతోపాటు ...
రుద్రంపేట సర్కిల్ నుంచి కళ్యాణదుర్గం బైపాస్ సర్కిల్ వరకూ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన నాటిన చెట్లు ఇవి. మండే ఎండలకు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చనిపోయాయి. మొక్కలు నాటించడంతో తమ పని అయిపోయినట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు భావించినట్లున్నారు. హైవే నిర్మాణ క్రమంలో కొన్ని వందల వేప చెట్లను నిలువునా నరికేశారు. వాటి స్థానంలో ..