Home » BRS
వివిధ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేర తీసుకున్న గ్యారంటీ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘రుణాల రీస్ట్రక్చరింగ్’పై పరిశీలన చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రం అప్పులకుప్పలా మారిపోయిందని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అడ్డగోలు అప్పులు గుదిబండలా మారాయని రేవంత్ సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను ఓడించేందుకు గత్యంతరం లేని పరిస్థితిలోనే కాంగ్రె్సను గెలిపించారని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నా రు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే చీ కొట్టించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అలవి కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బీఆర్ఎ్సలో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి, ‘గెలిపించుకు రండి’ అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్ఠానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నబాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎ్సలో చేరిన ఏనుగుల రాకేశ్ రెడ్డిని అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
Telangana: రైతుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గు చేటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లల్లో రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేసింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. గజ దొంగల్లా బేడీలు వేశారని.. నేరెళ్ల ఘటన ఎవరి హయాంలో జరిగిందని అన్నారు. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం గోసపుచ్చుకుందని.. దాన్ని ఎవరు మర్చిపోలేదన్నారు.
Telangana: మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న కామెంట్స్పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. పద్మశాలిలు నిరోద్లు అమ్ముకోవాలంటూ తాను వ్యాఖ్యలు చేసినట్లుగా కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలిలను అనలేదనీ, ఒక వ్యక్తితో వేరే సందర్బంలో మాట్లాడిన వాటిని కట్అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారని తెలిపారు.
రాష్ట్రంలో సక్రమంగా విద్యుత్తు సరఫరా చేయించడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చేతకావడంలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్తు ఉద్యోగులపై నిందలు మోపుతూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యుత్తు ఉద్యోగులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, తాము చెబితేనే కరెంటు కోతలకు పాల్పడుతున్నారంటూ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం తగదని హితవు పలికారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో బుధవారం ఆ మూడు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఎన్నికల హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తోందని, సర్కారు చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ధాన్యానికి రూ.500బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు సన్న రకాల ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచించడమేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సన్న రకం ధాన్యాన్ని 10శాతం మాత్రమే పండిస్తారని, 90శాతం ఇతర రకాల ధాన్యం వస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ పూర్తైంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు స్థానాల్లోనే బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత ఆయా పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరించి రాజకీయాలపైనే దృష్టి పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. తరుగు పేరుతో క్వింటాల్కు మూడు కేజీలు తీస్తున్నారని..
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పంద్రాగస్టులోగా