Home » AP News
ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.
జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించిప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
ఓ వైద్యురాలి అప్రమత్తత ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపింది. రహదారి మీదనే సీపీఆర్ చేయడంతో బాలుడి ప్రాణం నిలిచింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైద్యురాలు రవళికి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. విజయవాడలోని అయ్యప్ప నగర్లో ఆరేళ్ల బాలుడు సాయి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల రణరంగం అంతా ఇంతా కాదు. టీడీపీ నేతలపై దాడులు, నిర్బంధం ఇలా అనేక రకాలుగా దుశ్చర్యలకు పాల్పడ్డారు వైసీపీ నేతలు. అధికారపార్టీ విధ్వంసంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ వైసీపీ నేతలను పోలీసుల అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయంపై ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల(Andhra Pradesh Elections) నేపథ్యంలో జగన్(YS Jagan) సర్కార్ విపరీత పోకడల కారణంగా మొత్తం పోలీసు శాఖపైనే మచ్చ పడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం పోలీసు యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. దీని ఫలితంగా..
పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి ఎస్ఐపై వైసీపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల13న బొల్లాపల్లి ఎస్ఐ చెన్నకేశవులుపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెలుగు యువత నాయకుడు పోక వెంకట్రావు కారుపై దాడి చేసి బొల్లాపల్లి వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారు.
పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో దాచిన పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు భారీగా స్వాధీనపరచుకున్నారు. పోలీసులు అల్లర్లు జరిగిన గ్రామల్లో విస్తృత తనిఖీలు నిర్వహించేక్రమంలో ఇవి
రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులను జగన్ సర్కారు ఎప్పటికప్పుడు నిండా ముంచేస్తోంది. ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యాయి
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం వ్యక్తిగత వివరణ ఇచ్చారు. సుమారు అరగంట పాటు సీఎస్, డీజీపీ వివరణ ఇచ్చారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.