Home » America
ఉద్యోగాల ఉద్వాసనకు గురైన హెచ్-1బీ వీసాదారులకు అమెరికా పౌరసత్వం, వలస సేవల ఏజెన్సీ యూఎస్సీఐఎస్ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగం కోల్పోయాక 60 రోజుల గ్రేస్ పిరియడ్ తర్వాత కూడా అమెరికాలో అదనపు కాలం నివసించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జారీ చేసిన మార్గదర్శకాలు జారీ చేసింది.
అరుదైన ఘటనకు అమెరికాలోని అధికార భవనం శ్వేత సౌధం (White House) వేదికగా మారింది. వందలాది ఆసియా అమెరికన్ల ముందు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ మహ్మద్ ఇక్బాల్ రచించిన ‘సారే జహాసే అచ్ఛా’ను ప్లే చేయగా ఆహుతులంతా ఎంజాయ్ చేశారు. హెరిటేజ్ మంత్ వేడుకల్లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. వచ్చిన అతిథులంతా పానీ పూరి తింటూ మరోవైపు సారే జహాసే అచ్చా వింటూ మురిసిపోయారు.
చాబహార్ పోర్టు నిర్వహణ కోసం ఇరాన్తో భారత్ కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందంపై అమెరికా పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్ మీద విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు.
ఇరాన్లోని చాబహార్ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల్లోనే అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై తాము ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని భారత్ను హెచ్చరించింది.
భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఆ అగ్రరాజ్యం మన దేశానికి మద్దతు తెలిపింది. అంతేకాదు.. చాలా సందర్భాల్లో
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు దేశ, విదేశాల నుంచి ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓ ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే వచ్చారు.
ఉన్నత విద్య కోసం రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లిన ఇద్దరు యువకులు డిగ్రీ పట్టా అందుకున్న వారం రోజులకే అక్కడి ఓ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని అరిజోనా ఫాసిల్ క్రీక్ జలపాతం వద్ద ఏప్రిల్ 8న జరిగిన ఘటనలో ఖమ్మంకు చెందిన లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి(23), హైదరాబాద్కు చెందిన రేపాల రోహిత్ మణికంఠ(25) ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విమానం నుంచి మంచు ముక్క పడటంతో నేలమీద ఉన్న ఓ మహిళకు చెందిన మేక చనిపోయిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఈ ఘటనతో మేకలను పెంచుకుంటున్న ఆ మహిళకు భారీ షాక్ తగిలింది.
చేయని తప్పునకు స్కూల్ నుంచి డీబార్ అయిన ఇద్దరు విద్యార్థులకు రూ.8 కోట్ల పరిహారం చెల్లించాలంటూ అమెరికాలోని ఓ న్యాయస్థానం ఆదేశించింది. వారిని స్కూల్ నుంచి తొలగించే క్రమంలో పాఠశాల యాజమాన్యం నిబంధనల ప్రకారం నడుచుకోలేదని అభిప్రాయపడింది.