టిప్పర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
ABN , Publish Date - May 02 , 2024 | 12:23 AM
కొత్తూర్ పోలీ్సస్టేషన్ పరిధిలోని సిద్దాపూర్ గ్రామ శివారులో గల క్వారీ వద్ద బుధవారం టిప్పర్ బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్ మూడావత్ హన్మంత్(46) మృతి చెందాడని ఎస్ఐ జి. శ్రీనివాస్ తెలిపారు.
కొత్తూర్, మే 1: కొత్తూర్ పోలీ్సస్టేషన్ పరిధిలోని సిద్దాపూర్ గ్రామ శివారులో గల క్వారీ వద్ద బుధవారం టిప్పర్ బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్ మూడావత్ హన్మంత్(46) మృతి చెందాడని ఎస్ఐ జి. శ్రీనివాస్ తెలిపారు. క్వారీ వద్ద గల కంకర్ మిషన్ వద్ద టిప్పర్ ద్వారా కంకరను తరలిస్తుండగా అదుప తప్పి బోల్తా పడడంతో హన్మంత్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని శపరీక్ష కోసం షాద్నగర్ కమ్యూనిటీ అసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని భార్య మోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి. శ్రీనివాస్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
షాద్నగర్రూరల్, మే 1: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిగి రోడ్డులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ప్రతాప్లింగం కథనం ప్రకారం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన సందీప్(26) అనే యువకుడు షాద్నగర్కు చెందిన స్నేహితుడు ఫోన్ చేయడంతో రాత్రి 9 గంటలకు బైక్పై షాద్నగర్ వస్తుండగా ఎలికట్టలో రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. దాంతో అక్కడికక్కడే మృతి చెదాడు. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.