Share News

రెయిలింగ్‌కు ఢీకొన్న బైక్‌.. వ్యక్తి దుర్మరణం

ABN , Publish Date - May 02 , 2024 | 12:43 AM

అతి వేగంతో బైక్‌ రోడ్డు పక్కన ఉన్న రెయిలి ంగ్‌ను ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పరిగి మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామానికి చెందిన చాకలి దశరథ్‌ (49) బుఽధవారం బైక్‌(టిఎస్‌34ఈ 4056)పై పరిగికి వస్తుండగా చింతలచెరువు మలుపులో రోడ్డు పక్కన ఉన్న స్టీల్‌ రెయిలింగ్‌ను వేగంగా ఢీకొన్నాడు.

రెయిలింగ్‌కు ఢీకొన్న బైక్‌.. వ్యక్తి దుర్మరణం

పరిగి, మే 1: అతి వేగంతో బైక్‌ రోడ్డు పక్కన ఉన్న రెయిలి ంగ్‌ను ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పరిగి మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామానికి చెందిన చాకలి దశరథ్‌ (49) బుఽధవారం బైక్‌(టిఎస్‌34ఈ 4056)పై పరిగికి వస్తుండగా చింతలచెరువు మలుపులో రోడ్డు పక్కన ఉన్న స్టీల్‌ రెయిలింగ్‌ను వేగంగా ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలైన దశరథ్‌ను స్థానికులు పరిగి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. దశరథ్‌ భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.

Updated Date - May 02 , 2024 | 12:43 AM