దేశాన్ని ముక్కలు చేస్తున్న మోదీ
ABN , Publish Date - May 02 , 2024 | 12:25 AM
కుల, మతాల పేరుతో దేశాన్ని నరేంద్రమోదీ ముక్కలు చేస్తున్నారని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు.
చౌదరిగూడ/కొందుర్గు/షాద్నగర్రూరల్/కేశంపేట, మే 1: కుల, మతాల పేరుతో దేశాన్ని నరేంద్రమోదీ ముక్కలు చేస్తున్నారని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని కాస్లాబాద్, ఎదిర, రావిర్యాల, గుర్రంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతా్పరెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు, పూలతో స్వాగతం పలికారు. మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, మండలాధ్యక్షుడు రాజు, కొందుర్గు మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బంగారం ధరలు తగ్గాలంటే, కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని వంశీచంద్రెడ్డి అన్నారు. కొందుర్గు మండల కేంద్రంలోని దళితవాడలో, మండల పరిధిలోని ఆగిర్యాల, వెంకిర్యాల, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్లలో కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, ఒక్క ఫించన్ కూడా ఇవ్వలేదని, గ్రామానికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మోదీ సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కొందుర్గులో కాలేజీని త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని, క్రీడా స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతా్పరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ఆకర్షితులై పార్టీలో భారీగా చేరికలు అవుతున్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చౌదరిగూడ మండలం వనంపల్లి మాజీ సర్పంచ్ కవితగోపాల్రెడ్డితో పాటు మాజీ వార్డు సభ్యులు షాద్నగర్ శంకర్, వంశీచంద్ రెడ్డి, ప్రతా్పరెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. గుర్రంపల్లి మాజీ సర్పంచ్ నిర్మల లక్ష్మినారాయణతో పాటు 32 కుటుంబాలకు చెందిన సభ్యులు పార్టీలో చేరారు. వంశీచంద్కు మద్దతుగా ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. వెలిజర్లలో మాజీ ఎంపీటీసీ నర్సింహ్మరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. షాద్నగర్ ఏసీఎం మాజీ చైర్మన్ యాదయ్య యాదవ్ నేతృత్వంలో కేశంపేట మండలం బైర్కాన్పల్లి, మంగళగూడలో ప్రచారం చేపట్టారు. చౌలపల్లిలో మండలాధ్యక్షుడు వీరేశ్, కేశంపేటలో యెన్నం శ్రీధర్రెడ్డి, కొండారెడ్డిపల్లి పల్లె ఆనంద్ కుమార్, పోమాల్పల్లిలో అనుమగళ్ల రమేష్, తొమ్మిదిరేకులలో కరుణాకర్ రెడ్డి, లింగంధనలో రాజేందర్ రెడ్డి, కొత్తపేటలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్ప ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.