కారు-ద్విచక్ర వాహనం ఢీ.. వ్యక్తి మృతి
ABN , Publish Date - May 02 , 2024 | 12:45 AM
కారు-ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
రాయపోల్, మే 1 : కారు-ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కిష్టాసాగర్ వద్ద చోటుచేసుకుందంంఇ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా రాజబొల్లారానికి చెందిన కోట బాబుశేఖర్ తన భార్యాపిల్లలతో బుధవారం ఉద యం కారులో రాయపోల్ వచ్చాడు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో రాయపోల్ మండలం కృష్ణసాగర్ వద్దకు రాగా అదే సమయంలో కీసర మండలం బండ్లగూడకు చెందిన కట్టా ప్రేమ్కుమార్, కుంభదేవ్ ద్విచక్ర వాహనంపై గజ్వేల్ నుంచి రాయపోల్ వైపు వస్తున్నారు. బైక్, కారు ఢీకొనడంతో బైక్ వెనక కూర్చున్న కుంభదేవ్(35) ఎగిరి కారుపై పడి కిందపడ్డాడు. దీంతో అతని కాలు నుజ్జునుజ్జు అయ్యింది. చెయ్యి విరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్ర వాహనం వేగంగా రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుందని, బాబుశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘుపతి తెలిపారు.