Share News

గొర్రె పొట్టేళ్ల పందెం నిర్వాహకులు అరెస్ట్‌

ABN , Publish Date - May 02 , 2024 | 12:41 AM

గొర్రె పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న వారిని అరెస్ట్‌ చేసిన సంఘటన శామీర్‌పేట్‌ మండలంలో మంగళవారం జరిగింది.

గొర్రె పొట్టేళ్ల పందెం నిర్వాహకులు అరెస్ట్‌

మూడుచింతలపల్లి, మే 1 : గొర్రె పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న వారిని అరెస్ట్‌ చేసిన సంఘటన శామీర్‌పేట్‌ మండలంలో మంగళవారం జరిగింది. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో కొందరు గొర్రె పొట్టేళ్ల పందాలను నిర్వహిస్తున్నానే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు పొట్టేళ్లు, 2ఆటోలు, 8 మంది ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు రూ.27 వేలు వరకు జరిగినట్లు, 5సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Updated Date - May 02 , 2024 | 12:41 AM