Share News

అరుణమ్మ గెలుపు ఖాయం : పీవీఆర్‌

ABN , Publish Date - May 02 , 2024 | 12:26 AM

ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తే మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపు ఖాయమనిపిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

అరుణమ్మ గెలుపు ఖాయం : పీవీఆర్‌
కొత్తూర్‌ : ప్రచారంలో పాల్గొన్న పీవీఆర్‌

కొత్తూర్‌/షాద్‌నగర్‌రూరల్‌/చౌదరిగూడ, మే 1: ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తే మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపు ఖాయమనిపిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. కొత్తూర్‌ మండలం ఇన్ముల్‌నర్వ, సిద్దాపూర్‌, వైఎం తండా, ఎస్‌బీ పల్లి, కొడిచర్ల, పెంజర్ల గ్రామాల్లో విష్ణువర్ధన్‌రెడ్డి ప్రచారం చేశారు, బావండ్ల మాణిక్యం, మంగలి రమేష్‌, మహేందర్‌రెడ్డి తదితరులున్నారు. కాగా, కొత్తూర్‌ మున్సిపాలిటీకి చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, కొత్తూర్‌ జీపీ మాజీ పర్సన్‌ ఇన్‌చార్జి కడెంపల్లి సదానంద్‌గౌడ్‌ బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో డీకే అరుణ సమక్షంలో పార్టీలో చేరారు. ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్టలో డీకే అరుణకు మద్దతుగా సీనియర్‌ నాయకులు వెంకటేష్‌ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. అరుణమ్మకు మద్దతుగా చౌదరిగూడ మండలం తుమ్మలపల్లి, గాలిగూడ, ఎదిర తదితర గ్రామాల్లో నాయకులు ప్రచారం చేశారు. మండలాధ్యక్షుడు కురుమయ్య, నాయకులు భూపాలచారి, దిలీ్‌పరెడ్డి, లింగం, బీమయ్య, తదితరులున్నారు.

Updated Date - May 02 , 2024 | 12:26 AM