చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - May 02 , 2024 | 12:23 AM
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ మక్భూల్జానీ తెలిపారు. ఏప్రిల్ 29న మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో భిక్షాటన చేసుకుంటూ అనారోగ్యానికి గురైన వ్యక్తి (65)ని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు సీఐ తెలిపారు.
కందుకూరు, మే 1: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ మక్భూల్జానీ తెలిపారు. ఏప్రిల్ 29న మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో భిక్షాటన చేసుకుంటూ అనారోగ్యానికి గురైన వ్యక్తి (65)ని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు సీఐ తెలిపారు. ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు చెప్పారు. ఆయనకు వడదెబ్బ తగిలినట్లు వైద్యులు తెలిపినట్లు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రైలు ఢీకొని గుర్తుతెలియని మరో వ్యక్తి..
షాద్నగర్రూరల్, మే 1: షాద్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిగూడ శివారులో గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపారు. సుమారు 60 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి లింగారెడ్డిగూడ మసీదు వెనుక రైలు ఢీకొని మృతిచెందాడని తెలిపారు. వైట్కలర్ బనియన్, తెల్లటి గడ్డం, కుడిచేతికి రెండు వరసల నల్లటి ధారం కట్టి ఉన్నట్లు తెలిపారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు 9848090426కు సమాచారం ఇవ్వాలని కోరారు.
నందిగామ మండల కేంద్రంలో మరొకరు..
నందిగామ, మే 1: రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన నందిగామ మండల కేంద్రంలోని రైల్వేట్రాక్పై బుధవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు ధరించిన ప్యాంటు జేబులో లభించిన ఆధార్కార్డు ఆధారంగా అస్సాం రాష్ర్టానికి చెందిన ప్రణబ్ దాస్(46)గా గుర్తించారు. మండలకేంద్రం సమీపంలో రైలు ఢీకొని మృతిచెందినట్లు రైల్వేపోలీస్ మల్లేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాదనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.