లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
ABN , Publish Date - May 02 , 2024 | 12:21 AM
బాలికపై అత్యాచారనికి పాల్పడి, మోసం చేసిన వ్యక్తికి 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ. 40 వేలు జరిమానా విధిస్తూ ఎల్బీ నగర్ ఫాస్ట్ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి హరీష బుధవారం తీర్పునిచ్చారు.
చేవెళ్ల, మే 1 : బాలికపై అత్యాచారనికి పాల్పడి, మోసం చేసిన వ్యక్తికి 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ. 40 వేలు జరిమానా విధిస్తూ ఎల్బీ నగర్ ఫాస్ట్ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి హరీష బుధవారం తీర్పునిచ్చారు. చేవెళ్ల ఏసీపీ బంటు కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో చేవెళ్లలో నివాసం ఉంటున్న ఓ బాలికను సంగారెడ్డి జిల్లా కల్హార్ మండలం కిస్తాపూర్కు చెందిన రత్నం అలియాస్ కిరణ్(34) అనే యువకుడు ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో బాలికను పెళ్లి చేకుంటానని మయామాటలు చెప్పి యాదగిరి గుట్ట తీసుకువచ్చాడు. అక్కడ గదిని అద్దెకు తీసుకుని అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత బాలిక గర్భం దాల్చింది. తర్వాత వివాహం చేసుకోనని చెప్పి బాలికను మోసం చేశాడు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్పటి సీఐ గురువయ్యగౌడ్ హత్యచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాడు. వాదోపవాదలు విన్న న్యాయమూర్తి కేసు రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 40 వేల జరిమానా విధించారు.