బైక్ను ఢీకొన్న లారీ.. వ్యక్తికి గాయాలు
ABN , Publish Date - May 02 , 2024 | 12:43 AM
బైక్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఓగీపూర్ వద్ద జరిగింది.
తాండూరు రూరల్, మే 1: బైక్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఓగీపూర్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని గుల్బర్గ జిల్లా ఎన్.వెంకటాపురం గ్రామానికి చెందిన వెంకట్రాములు(45) గనుల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం వెంకట్రాములు మరో వ్యక్తితో కలిసి బైక్(ఏపీ22క్యూ2784)పై ఓగీపూర్కు వెళుతున్నాడు. సాగర్సిమెంట్ ఫ్యాక్టరీ మెయిన్ రోడ్డు వద్ద ఒక లారీ(ఏపీ16టీక్యూ1818) బైక్కు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న వెంకట్రాములు, తుల్జారామ్లకు గాయాలయ్యాయి. వెంకట్రాములు తలకు గాయాలయ్యా యి. చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. అతడి సోదరుడు ఆశప్ప ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ లక్ష్మయ్యపై కేసు చేశామని ఎస్సై తెలిపారు.