భారత్కు రెండో స్థానం
ABN , Publish Date - May 02 , 2024 | 03:26 AM
థామస్ కప్లో భాగంగా బుధవారం జరిగిన తమ గ్రూప్-సి ఆఖరి మ్యాచ్లో డిఫెండింగ్ చాంప్ భారత్ 1-4తో ఇండోనేసియా చేతిలో ఓటమి పాలైంది...
థామస్ కప్ క్వార్టర్స్లో చైనాతో ఢీ నేడు
చెంగ్డూ (చైనా): థామస్ కప్లో భాగంగా బుధవారం జరిగిన తమ గ్రూప్-సి ఆఖరి మ్యాచ్లో డిఫెండింగ్ చాంప్ భారత్ 1-4తో ఇండోనేసియా చేతిలో ఓటమి పాలైంది. కాగా, ఈ రెండు జట్లు ఇప్పటికే క్వార్టర్స్కు అర్హత సాధించినా, తాజా పోరుతో గ్రూప్-సి నుంచి ఇండోనేసియా టాపర్గా నిలవగా, భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, ఇండోనేసియాతో పోరులో ప్రణయ్ మినహా, భారత షట్లర్లంతా ఓడారు. కాగా భారత పురుషుల జట్టు చైనాతో, మహిళల జట్టు జపాన్తో గురువారం క్వార్టర్స్లో తలపడనున్నాయి.