మావాడి హృదయం ముక్కలైంది
ABN , Publish Date - May 02 , 2024 | 03:30 AM
డ్యాషింగ్ బ్యాటర్ రింకూసింగ్ టీ20 ప్రపంచ కప్ జట్టు ఎంపికపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ మంగళవారం ప్రకటించిన తుది 15 మంది జట్టులో అతడికి చోటు దక్కలేదు...
క్రికెటర్ రింకూ తండ్రి నిరాశ
న్యూఢిల్లీ: డ్యాషింగ్ బ్యాటర్ రింకూసింగ్ టీ20 ప్రపంచ కప్ జట్టు ఎంపికపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ మంగళవారం ప్రకటించిన తుది 15 మంది జట్టులో అతడికి చోటు దక్కలేదు. వరల్డ్కప్ జట్టులో స్థానం దక్కలేదని తెలిసి తన కుమారుడి గుండె పగిలిందని రింకూ తండ్రి ఖన్చంద్ర సింగ్ వెల్లడించాడు. తాము కూడా ఎంతో ఆశతో ఉన్నామని, కుమారుడి ఎంపికను సెలబ్రేట్ చేసుకొనేందుకు మిఠాయిలతోపాటు బాణసంచాను కూడా తెచ్చి ఉంచామని ఖన్చంద్ర తెలిపాడు. కాగా చెన్నై ఆల్రౌండర్ శివమ్ దూబే తాజా ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతుండడం కూడా రింకూ అవకాశాలను దెబ్బ తీసింది. మరోవైపు రింకూను బలిపశువుని చేశారని టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ధ్వజమెత్తాడు. ‘జైస్వాల్నో, లేక ఇంకెవరినైనా తప్పించి రింకూను తీసుకోవాల్సింది’ అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.