Share News

పాండ్యా సహా ముంబై జట్టుకు జరిమానా

ABN , Publish Date - May 02 , 2024 | 03:33 AM

పరాజయ పరంపరలో కొట్టుమిట్టాడుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్‌. మంగళవారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడినందుకుగాను...

పాండ్యా సహా ముంబై జట్టుకు జరిమానా

లఖ్‌నవూ: పరాజయ పరంపరలో కొట్టుమిట్టాడుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్‌. మంగళవారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడినందుకుగాను ఆ జట్టు సారథి హార్దిక్‌ పాండ్యాకు రూ. 24 లక్షలు, అలాగే జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించారు. నిర్ణీత సమయానికి ఓవర్ల కోటా పూర్తి చేయకపోవడం ముంబైకిది రెండోసారి. అందుకే కెప్టెన్‌ హార్దిక్‌కు భారీ జరిమానా విధించినట్టు ఐపీఎల్‌ నిర్వాహకులు వెల్లడించారు.

Updated Date - May 02 , 2024 | 03:33 AM