BJP: మహబూబాబాద్‌‌లో జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం

ABN, Publish Date - Apr 30 , 2024 | 12:56 PM

మహబూబాబాద్‌: భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించి దేశం అభివృద్ధిలో అగ్రభాగానికి చేరిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్‌ గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మానుకోట జనసభను సోమవారం నిర్వహించారు. ఈ సభకు హాజరైన నడ్డా మాట్లాడుతూ దేశంలోని జాతీయ రహదారులకు మహర్దశ కల్పించేందుకు కృషి చేశామని, హైదరాబాద్‌ నుంచి మహబూబాబాద్‌ మీదుగా భద్రాచలం వరకు జాతీయ రహదారి నిర్మించడంతో పాటు పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రంలో హైదరాబాద్‌ తరహాలో పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనన్నారు.

BJP: మహబూబాబాద్‌‌లో జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం 1/5

భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించి దేశం అభివృద్ధిలో అగ్రభాగానికి చేరిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా పేర్కొన్నారు.

BJP: మహబూబాబాద్‌‌లో జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం 2/5

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన జనసభలో పాల్గొని ప్రసంగిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..

BJP: మహబూబాబాద్‌‌లో జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం 3/5

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన జనసభకు విచ్చేసిన జేపీ నడ్డా.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.

BJP: మహబూబాబాద్‌‌లో జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం 4/5

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జిల్లా నేతలు గజమాలతో సన్మానిస్తున్న దృశ్యం.

BJP: మహబూబాబాద్‌‌లో జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం 5/5

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన బీజేపీ జనసభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం..

Updated at - Apr 30 , 2024 | 12:56 PM