Share News

Hyderabad: అయ్యోదేవుడా..ఎంతఘోరం జరిగిందో.. బస్సు ఢీకొని బీటెక్‌ విద్యార్థి..

ABN , Publish Date - Apr 19 , 2024 | 09:09 AM

కుటుంబసభ్యులకు టిఫిన్‌ తీసుకురావడానికి బైక్‌పై వెళ్తున్న ఓ బీటెక్‌ స్టూడెంట్‌(B.Tech student)ని ఓ ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

Hyderabad: అయ్యోదేవుడా..ఎంతఘోరం జరిగిందో.. బస్సు ఢీకొని బీటెక్‌ విద్యార్థి..

హైదరాబాద్: కుటుంబసభ్యులకు టిఫిన్‌ తీసుకురావడానికి బైక్‌పై వెళ్తున్న ఓ బీటెక్‌ స్టూడెంట్‌(B.Tech student)ని ఓ ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‏స్టేషన్‌ పరిధిలోని గాజులరామాం మహదేవ్‌పురం వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. సంగారెడ్డి(Sangareddy) జిల్లా, సిరిగాపూర్‌ గ్రామానికి చెందిన ఏషబోయిన రాములు గాజులరామారం ప్రాంతంలోని మల్లారెడ్డినగర్‌, షిర్టీహిల్స్‌ వద్ద గల ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

ఇదికూడా చదవండి: Horoscope Today: ఈ రాశుల వారు ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు.. శుభప్రదం!

ఇతనికి భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు లక్ష్మణ్‌(19) ఉన్నారు. లక్ష్మ్ణణ్‌ బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం 6.30 గంటలకు కుటుంబసభ్యులకు టిఫిన్‌ తీసుకురావడానికి స్కూటీపై వెళ్లాడు. మల్లారెడ్గినగర్‌ వైశాలి టింబర్‌ డిపో వద్ద ప్రైవేట్‌ బస్సు వేగంగా వచ్చి లక్ష్మన్‌ను ఢీకొట్టింది. దీంతో లక్ష్మణ్‌ తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లక్ష్మణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

city2.2.jpg

ఇదికూడా చదవండి: TG Politics: టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా.. కాంగ్రెస్ ఎంపీ ప్రతిపాదన!

Updated Date - Apr 19 , 2024 | 09:09 AM