Home » National
కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ లోక్సభ స్థానం అభ్యర్థి స్మృతి ఇరానీని టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఆమె అమేథీ..
తమిళనాడు: రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం మధ్య రాష్ట్రానికి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఈనెల 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో అల్లర్లు చెలరేగాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో భారతీయ విద్యార్థులు తీవ్రభయాందోళనతో గడుపుతున్నారు. అల్లర్ల నేపథ్యంలో ఇల్లు వదిలి బయటకు రావొద్దని భారత విద్యార్థులను కిర్గిస్థాన్లోని భారత ఎంబసీ సూచించింది.
మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి తమ తమ ఇళ్ల దగ్గర నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికల ప్రచార సందడి ముందు సినిమాలు తీయడం ఓ జోక్లా కనిపిస్తోందని నటి, మండీ లోక్సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను వివరిస్తూ ఆమె ఇన్స్టాగ్రాంలో వీడియోను పోస్టు చేశారు.
సార్వత్రిక ఎన్నికలు ముగింపునకు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 14 నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి.
గత డెబ్బయి ఏళ్లుగా చేతిలో బాంబులు పెట్టుకొని బెదిరించిన పాకిస్థాన్ ఇప్పుడు భిక్షాపాత్ర పట్టుకొని తిరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. హరియాణాలోని అంబాలాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరాన్ని బుల్డోజర్తో నేలమట్టం చేస్తారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కూటమి పార్టీల అగ్రనేతలు నిప్పులు చెరిగారు. అయోధ్య నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు దేశంలో మత స్వేచ్ఛను కాపాడతామని స్పష్టం చేశారు.
రాసలీలల వివాదంలో చిక్కుకున్న ప్రజ్వల్పై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ తెలిపారు. తన 91వ జన్మదినం సందర్భంగా బెంగళూరులోని వెంకటేశ్వర ఆలయంలో శనివారం పూజలు జరిపించారు.
ఛాందసవాద ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా.. కొంతకాలంగా ఆధునిక పంథాలో పయనిస్తోంది. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ప్రగతిశీల ఆలోచనా ధోరణితో చేపట్టిన సంస్కరణలు, ఆ దేశాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా మరో సంచలనానికి సౌదీ తెరతీసింది.