Home » Andhra Pradesh » Prakasam
పొగాకు మార్కెట్ కళకళలాడుతోంది. ప్రస్తుత సీజన్లో ధరలు అదిరిపోతున్నాయి. ఊహించని రీతిలో రికార్డు స్థాయిలో లభిస్తున్నాయి. దీంతో అప్పుడే రైతులు వచ్చే సీజన్ సాగుపై దృష్టి సారించారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమికే అధికారం దక్కనుందని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జాతీయ సర్వే సంస్థలు దాదాపు పూర్తిగా కూటమికే విజయావకాశాలున్నాయని తేల్చేశాయి.
ఎన్నికల సమయంలో రౌడీయిజానికి పాల్పడిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబీకులపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కూటమి ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ డిమాండ్ చేశారు.
జిల్లాలో 24 ఎయిడెడ్ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమైంది. అసలు పిల్లలు లేని(జీరో ఎన్రోల్మెంట్), పది మందిలోపు విద్యార్థులు ఉన్నవాటిని గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు జారీచేసి మూసివేయాలని ప్రభుత్వం డీఈవోని ఆదేశించింది.
ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ దినేష్కుమార్ పరిశీలించారు.
పది మందికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు ఎవరు నిర్వహించినా వారు అభినందనీయులని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొం డయ్య అన్నారు. మండల పరిఽధిలోని ఈపురుపాలెంలో మర్చంట్స్ అసోసియేషన్ వా రి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కొండయ్య ప్రారంభించారు.
కౌంటింగ్ సమయంలో చీరాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఎ లక్షన్ నేపథ్యంలో శనివారం చీ రాల వన్టౌన్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. ఈసందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంగళవారం రెండు కెమెరాల పర్యవేక్షణలో చీరాలపై దృష్టి సారించినట్లు చెప్పారు.
ఆర్టీసీ బస్టాండ్ వద్ద గొయ్యి ప్రమాకరంగా ఉంది. అ వుట్ గేట్ నుంచి బయటకు వచ్చే చోట సైడ్ డ్రైన్కు పెద్ద గొయ్యి ప డింది. గతంలో ఉన్న గొయ్యిని మ ట్టితో పూడ్చగా మరలా సమీపంలో మరో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో వాహనచోదకులు, ప్రయాణికులు ప్రమాదపు అంచున ప్ర యా ణం చేస్తున్నారు.
హనుమజ్జయంతిని శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హనుమజ్జయంతి శనివారం రోజు రావడంతో శింగరకొండ కు భక్తులు పోటెత్తారు. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో గురువారం ప్రారంభమైన హనుమజ్జయంతి ఉత్సవాలు శనివారంతో ముగిసాయి. శనివారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, బిందెతీర్థం, గోపూజ నిర్వహించారు. అనంతరం నిత్యాభిషేకాలు నిర్వహించారు.
హనుమాన్ జయంతి పర్వదినా న్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. హనుమాన్ దే వాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక రేడి యోబావి సెంటర్లోగల శ్రీఅభయాంజనేయస్వామి దే వాలయంలో శనివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. ఆంజనేయస్వామికి అభిషేకాలు, ఆకు పూజలు నిర్వహించారు. సామూహికంగా హనుమాన్ చాలీసా పఠనం చేశారు.