Share News

Delhi: రాహుల్‌ గాంధీలో సత్తా లేదు: రాజ్‌నాథ్‌

ABN , Publish Date - May 06 , 2024 | 06:15 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీలో సత్తా లేదని, అయితే ఆయన పార్టీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు.

Delhi: రాహుల్‌ గాంధీలో సత్తా లేదు: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, మే 5: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీలో సత్తా లేదని, అయితే ఆయన పార్టీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. ఆయన పీటీఐతో శనివారం మాట్లాడుతూ పలు అంశాలపై చర్చించారు. ఎన్డీయే కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందని, బీజేపీ 370కి పైగా సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర, తెలంగాణలోనూ మెరుగైన సంఖ్యలో సీట్లు గెలుస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌, ఒకే దేశం.. ఒకే ఎన్నికపై ముందడుగు పడుతుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చడంగాని, రిజర్వేషన్లను రద్దు చేయడంగానీ బీజేపీ ఎప్పటికీ చేయబోదని స్పష్టం చేశారు.

Updated Date - May 06 , 2024 | 06:15 AM