Share News

Bangalore: అబద్ధాలకు నాయకుడు ప్రధాని మోదీ: ఖర్గే

ABN , Publish Date - May 06 , 2024 | 06:10 AM

ప్రధాని మోదీ అబద్ధాల దేవుడంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ధ్వజమెత్తారు. ‘విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చేస్తా. natio

Bangalore: అబద్ధాలకు నాయకుడు ప్రధాని మోదీ: ఖర్గే

మాల్డా/బెంగళూరు(ఆంధ్రజ్యోతి), మే 5: ప్రధాని మోదీ అబద్ధాల దేవుడంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ధ్వజమెత్తారు. ‘విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చేస్తా. ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తా. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలిస్తా’ అంటూ పోయిన ఎన్నికలకు ముందు మోదీ హామీలిచ్చారని ఖర్గే గుర్తు చేశారు.

వీటిల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా తాను అబద్ధాల నాయకుడినని మోదీ నిరూపించుకున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ మండిపడ్డారు. మళ్లీ బీజేపీకి అధికారం అప్పగిస్తే మోదీ ఒక నియంతగా మారిపోతారని ఖర్గే హెచ్చరించారు. కాగా, రాసలీలల వివాదంలో ఇరుక్కున్న ఎంపీ ప్రజ్వల్‌ గురించి మాట్లాడబోనని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రజ్వల్‌ గురించి మాట్లాడే రేంజ్‌ తనకు లేదని ఎద్దేవా చేశారు.

Updated Date - May 06 , 2024 | 06:10 AM