ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. 

పండ్ల రసంలో చక్కెర అధికంగా ఉండడం వల్ల త్వరగా అలసట కలుగుతుంది. పదే పదే ఆకలి వేస్తూ ఉంటుంది. 

పండ్లలోని ఆమ్లత్వం రసంలో పేరుకుపోతుంది. ఇది దంతాలపై ఎనామెల్‌ని దెబ్బతీస్తుంది. 

పండ్లలో ఎలాంటి ఫైబర్ ఉండదు కాబట్టి.. ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియకూ సాయపడదు. 

ఖాళీ కడుపుతో జ్యూస్ తాగితే వికారంగా అనిపిస్తుంది. 

పండ్లను జ్యూస్‌గా మార్చడం వల్ల విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు కోల్పోతాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహనకు మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తగానే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.