అమెరికాలో రోడ్డు ప్రమాదం ముగ్గురు గుజరాతీ మహిళల మృతి
ABN , Publish Date - Apr 28 , 2024 | 05:53 AM
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుజరాత్కు చెందిన ముగ్గురు మహిళలు మరణించారు. మరొక వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది
వంతెనను ఢీకొని గాలిలో పల్టీలు కొట్టిన కారు
వాషింగ్టన్, ఏప్రిల్ 27: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుజరాత్కు చెందిన ముగ్గురు మహిళలు మరణించారు. మరొక వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. వారు ప్రయాణిస్తున్న కారు సౌత్ కరోలినా రాష్ట్రం గ్రీన్విల్లీ కౌంటీలోని వంతెనను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
అతివేగంగా వచ్చిన ఆ కారు వంతెనను ఢీకొని సుమారు 20 అడుగుల మేర గాలిలో పైకి ఎగిరి అవతల వైపు ఉన్న చెట్లలో పడింది. వాహనం ముక్క చెక్కలు కావడంతో అందులో ప్రయాణిస్తున్న రాఖీబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మినీషాబెన్ పటేల్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వీరు గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారులోని డిటెక్షన్ సిస్టం కుటుంబ సభ్యులకు అలెర్ట్ సందేశం పంపించింది. దాంతో వారు స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడంతో సహాయ బృందాలను తక్షణమే సంఘటన స్థలానికి పంపించారు.