క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది

చెస్‌ చాంపియన్‌ గుకేష్‌, ఒలింపిక్‌ పతక విజేత మను భాకర్‌లకు అవార్డులు వరించాయి

వీరికి ప్రతిష్ఠాత్మక ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న’ను ఇవ్వనున్నారు

అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్నకు నలుగురిని, అర్జున అవార్డుకు 32 మందిని ఎంపిక చేశారు

హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌లు కూడా ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు

తెలుగు అథ్లెట్లు జ్యోతి యర్రాజి, దీప్తి జీవాంజిలకు అర్జున దక్కాయి

అర్జునకు ఎంపికైన వారిలో 17 మంది పారా అథ్లెట్లు ఉండడం విశేషం

ఎక్కువ మంది పారిస్‌ పారాలింపిక్స్‌లో అదరగొట్టినవారే

ముగ్గురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు దక్కాయి