కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ దేవున్ని భక్తి శ్రద్ధలతో పుజీస్తే కోరిన కోరికలు నెరవేరతాయి.

కార్తీక పౌర్ణమి రోజున చేయవలసిన పనులు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదిలో లేదా సముద్రంలో స్నానం చేయాలి.

ఇంట్లో ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి.

ముఖ్యంగా 365 వత్తులతో దీపాలు వెలిగిస్తే విశేష ఫలితం ఉంటుంది.

శివాలయాలకు వెళ్లి శివలింగానికి అభిషేకం, పూజలు చేయాలి. లక్ష్మీదేవిని, విష్ణువును కూడా పూజించడం మంచిది.

వీలైతే, పగలంతా ఉపవాసం ఉండి, పాలు, పండ్లను తీసుకోవచ్చు. రాత్రికి భోజనం చేయవచ్చు.

కార్తీక పురాణం పుస్తకాలు, పసుపు, కుంకుమ, తాంబూలం వంటివి దానం చేయడం చాలా మంచిది.

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఎంతో పుణ్యదాయకం.

కార్తీక పురాణాన్ని పఠించడం లేదా వినడం చేయాలి.

ఆలయాల్లో దీపోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలి.