ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి  పయ్యావుల కేశవ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు

2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2,94,427.25 కోట్లతో  వార్షిక బడ్జెట్‌ను తీసుకొచ్చారు

మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు

రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు,

ద్రవ్య లోటు రూ. 68,742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్‌ ప్రసంగం ద్వారా వెల్లడించారు

ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో

కృషి చేస్తామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు

సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకానికి నిధులు కేటాయిస్తామన్నారు

పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు

త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు