మనందరం మినరల్ వాటర్ బాటిల్స్ కొంటాం. బాటిల్ ఖాళీ అయ్యాక చెత్త డబ్బాలో పడేస్తాం.

కొందరు వారాల పాటు అవే బాటిల్స్ వినియోగిస్తుంటారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే అని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి బాటిల్స్ దీర్ఘకాలంలో బిసెఫినాల్ ఏ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి.

ఈ రసాయనం శరీరంలో హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుంది.

అంతేకాకుండా, ఈ బాటిల్స్ నుంచి అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు కూడా విడుదల అవుతాయి. వీటిని మైక్రోప్లాస్టిక్స్ అంటారు.

వీటితో డయాబెటిస్ నుంచి క్యాన్సర్ వరకూ అనేక రోగాలు వస్తాయి.

వీటితో సంతానలేమి కూడా తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మైక్రోప్లాస్టిక్స్ పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి, ప్లాస్టిక్ బాటిల్స్‌ను పదే పదే వాడొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.