ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం ఉండటమే కాకుండా యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కూడా ఉన్నాయి.
ఉదయం పరగడుపున ఒక గ్లాసు మెంతుల నీరు తాగడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని చాలామంది నమ్ముతున్నారు.
ఈ సాంప్రదాయ పద్ధతి ఆయుర్వేదంలో శతాబ్దాలుగా ఉపయోగంలో ఉంది.
మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయాన్నే మరిగించి, వడకట్టి, ఆ నీటిలో తేనె , నిమ్మరసం కలిపి ఆ వాటర్ను ‘మెంతుల నీరు’ లేదా ‘ఫెనుగ్రీక్ వాటర్’ అని పిలుస్తారు.
డయాబెటిస్ రోగులకు ఇది ఒక వరం బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఉదయాన్నే ఈ నీరు తాగడం డయాబెటిక్లకు వైద్యులు కూడా సిఫారసు చేస్తారు.