మాంసాహారం ఎక్కువ తింటే.. ఏం జరుగుతుందంటే!

మాంసాహరం ఎక్కువ తినేవారికి మొటిమలు, మచ్చలు చర్మసంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

అధికంగా మాంసాహరం తీసుకుంటే రక్తంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది  రొమ్ము, అండాశయ క్యాన్సర్ కు దారితీస్తుంది.

మాంసాహారం ఎక్కువ తీసుకుంటే శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు, ధమనులకు ఆటంకం వంటి  సమస్యలు వస్తాయి.

మాంసాహరం ఎక్కువ తింటే పెద్ద పేగు, కడుపుకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది.

రక్తనాళాల పనితీరు మందగించడం వల్ల    47శాతం ఎక్కువగా  స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

మాంసాహారం ఎక్కువ తినేవారికి భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్  ఖచ్చితంగా వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

 మాంసాహారం ద్వారా విడుదల అయ్యే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు శరీరంలో కొవ్వుగా మారతాయి. ఇది ఊబకాయం సమస్యను పెంచుతుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. ఇది ఫ్యాటీ లివర్, గుండె జబ్బులకు కారణమవుతుంది.

ఎక్కువ మాంసాహారం తింటే అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. మెదడు పనితీరు మందగిస్తుంది.

మాంసం కోసం జంతువును చంపడానికి  ముందు  వాటిలో భయం, ఒత్తిడి కొన్నిరకాల రసాయలనాలను వెలువరిస్తాయి. ఆ మాంసాన్ని తిన్నప్పుడు రసాయనాల ప్రభావం వల్ల మనిషి జీవితకాలం కూడా తగ్గిపోతుందట.