అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తాగితే ఇన్ని లాభాలుంటాయని తెలుసా?

ఆయుర్వేదం అశ్వగంధను శక్తివంతమైన ఔషదంగా పేర్కొంది. దీన్ని ప్రతిరోజూ పాలలో కలిపి తాగితే చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి.

అశ్వగంధను తీసుకుంటే ఎముకలు, కండరాలు బలంగా, ఉక్కులాగా మారతాయి.

శరీరంలో వాపులు, నొప్పులు వేధిస్తుంటే అశ్వగంధను పాలతో తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.

రాత్రిపూట పాలలో అశ్వగంధ పొడిని కలుపుకుని తాగుతుంటే  కంటినిండా నిద్ర వస్తుంది.

అశ్వగంధ చూర్ణాన్ని తీసుకుంటే మానసిక సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళ వంటి సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది.

శరీరంలో సత్తువ తక్కువగా ఉన్నవారు అశ్వగంధను తీసుకుంటే అమితమైన శక్తి లభిస్తుంది. నరాలు, కండరాలు శక్తిని పుంజుకుంటాయి.

మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహాతో అశ్వగంధను వాడటం వల్ల రక్తంలో  చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవచ్చు.