ఉదయాన్నే పచ్చి కరివేపాకులు నమిలి తింటే.. ఏం జరుగుతుందంటే..!

పచ్చికరివేపాకులలో ఫైబర్, ఎంజైమ్ లు జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఆహారం బాగా జీర్ణమవుతుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఉదయాన్నే కరివేపాకులు తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. శరీరంలో కొవ్వు తొందరగా తగ్గి బరువు తగ్గుతారు.

కరివేపాకులను ఉదయాన్నే తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

 కరివేపాకులో ఉండే కార్భజోన్ ఆల్కలాయిడ్స్ యాంటీ ఒబెటిసీ గుణాలు కలిగి ఉంటాయి.  తద్వారా ఊబకాయం తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

పరగడుపునే కరివేపాకులు తింటే తీసుకునే ఆహారంలో పోషకాలను శరీరం చక్కగా శోషించుకోవడంలో సహాయపడుతుంది.

పచ్చికరివేపాకులు ఉదయాన్నే తింటే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. నెరిసిన జుట్టును నల్లగా మారుస్తుంది.

కరివేపాకులు నేరుగా నమిలి తినవచ్చు. లేదంటే కరివేపాకు పొడిని సూపులు, కూరల్లో వాడచ్చు. కరివేపాకును నీటిలో మరిగించి టీలా కూడా తాగొచ్చు.