ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్య డయాబెటిస్.

మధుమేహం సైలెంట్ కిల్లర్‌లా మనిషి ప్రాణాలను హరిస్తుంది.

అయితే షుగర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

డయాబెటిస్ బాధితులు ఎక్కువగా నీళ్లు తాగడానికి ఆసక్తి చూపిస్తారు.

రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తారు. 

ఆహారంలో ఎటువంటి మార్పులు చేయకపోయినా బరువు తగ్గుతారు.

కళ్లల్లోని ద్రవస్థాయిలో మార్పులు వచ్చి అస్పష్టమైన దృష్టి సమస్య వస్తుంది.

డయాబెటిస్ బాధితులకు విపరీతమైన ఆకలి అవుతూ ఉంటుంది.

చర్మం పొడిబారడం, కాళ్లు, చేతులు మొద్దుబారినట్టు అవుతుంది. 

డయాబెటిస్ బాధితులకు గాయాలు అయితే త్వరగా మానవు.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.