హై బీపీ, షుగర్ ఉన్న వాళ్లు.. ఈ ఫలం తినవచ్చా..

సీతాఫలం సీజన్ వచ్చేసింది. ఈ పండు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వీటిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు సి, బి6, పొటాషియం, మెగ్నీషియం తదితర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా అంటు వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.

సీతాఫలాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. 

సీతాఫలం బరువు తగ్గడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ ఆకుపచ్చ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె నుంచి మెదడు వరకు ప్రతిదీ మెరుగుపడుతుంది.

అధిక రక్తపోటుతో బాధపడేవారికి సీతాఫలం చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వీటిలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇది రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.

ఈ పండు తియ్యగా ఉంటుంది. దీనిలో గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉంటుంది. దీనిని డయాబెటిస్‌ ఉన్న వారు తీసుకొవచ్చు. కానీ అధికంగా తినవద్దని సూచిస్తున్నారు.

సీతాఫలంలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ పండు మలబద్ధకం, ఇతర క ఉదర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ పండు తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, సీతాఫలం మంచిది. దీనిలోని ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో మీరు తినాలనే కోరికను తగ్గిస్తుంది. అంటే అతిగా తినకుండా నిరోధిస్తుంది. దాంతో బరువు తగ్గడానికి ఆస్కారముంది.

సీతాఫలం తినడం వల్ల రక్తహీనత నయమవుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఐరన్‌ ఉంటుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఔషధం.

వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, ఆమ్లత్వం, అజీర్ణం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. మలబద్ధకం, విరేచనాలతో బాధపడేవారికి ఇది ఒక దివ్యౌషధంలా పని చేస్తుంది.

ఈ పండు.. కళ్ళకు కూడా చాలా మంచిది. ఇందులో లుటిన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. కళ్ళకు రక్షణ కల్పిస్తుంది.

విటమిన్ ఎ సమృద్ధిగా ఉండే ఈ పండుతో చర్మం, జుట్టు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది చర్మంపై మొటిమలు, వయసు సంబంధిత మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.