విదేశాలలో ముఖేష్ అంబానీకి ఉన్న విలాసవంతమైన ఆస్తుల చిట్టా ఇదీ..!

భారతదేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి  చాలా విలువైన ఆస్తులున్నాయి. ముంబైలోని యాంటీలియా అనే ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండవ ఇల్లు.

 భారతదేశంలోనే కాకుండా దుబాయ్, యూఎస్, యుకె లలో  కూడా ముఖేష్ అంబానీకి  విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి.

ముఖేష్ అంబానీ 2021లో యుకె లోని బకింగ్ హమ్ షైర్ లోని స్టోక్ పార్క్ కంట్రీ క్లబ్ ను 57మిలియన్ యూరోలు(500కోట్లకు పైనే) వెచ్చించి కొనుగోలు చేశాడు.  ఇందులో 49 బెడ్ రూమ్లు, గోల్ప్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్ తో సహా చాలా సదుపాయాలున్నాయి.

న్యూయార్క్ లోని మాండరిన్ ఓరియంటల్ హోటల్ ను 98.15 మిలియన్ డాలర్లకు(819 కోట్లకు పై మాటే) కొనుగోలు చేశాడు.  

ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్  కోసం పామ్ జుమేరాలో బీచ్ సైడ్ విల్లా కొనుగోలు చేశాడు. ప్రైవేట్ బీచ్, ఫూల్స్, స్పా, సెలూన్, పది బెడ్ రూమ్లు సహా అన్నీ  ఉన్నాయి. దీని విలువ 80మిలియన్ డాలర్లు(667కోట్లకు పై మాటే).

పామ్ జుమేరాలో మరొక విలాసవంతమైన విల్లా కూడా ముఖేష్ అంబానీ కొనుగోలు చేశారు.